సినిమాల మార్కెట్ను పెంచడంలో ఓటీటీ ప్లాట్ఫాంలు కీ రోల్ పోషిస్తున్నాయనేది ఎవరూ కాదనలేని సత్యం. ఇప్పటికే సినీ ఇండస్ట్రీ ప్రముఖుల్లో కొందరు సొంతంగా ఓటీటీ ప్లాట్ఫాంలను లాంఛ్ చేశారు. తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shahrukh Khan) కూడా చేరిపోయాడు. షారుక్ ఖానే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. SRK+ ( SRK+) పేరుతో ఓటీటీ ప్లాట్ఫాం లాంఛ్ చేయబోతున్నట్టు తెలిపాడు. దీనికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుందట.
ఈ ప్లాట్ ఫాంలో కొత్త కొత్త కథాంశాలతో కూడిన కంటెంట్ రాబోతుందట. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ SRK+ లో మొదటి సినిమా చేయబోతున్నాడని సమాచారం. 2018లో ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్లో వచ్చిన జీరో సినిమాలో చివరిసారిగా నటించాడు షారుక్. మూడేళ్ల విరామం తర్వాత సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో ప్రస్తుతం పఠాన్ సినిమా చేస్తున్నాడు.
యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికాపదుకొనే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. డింపుల్ కపాడియా, జాన్ అబ్రహాం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత సినిమా చేస్తుండటంతో ఈ సారి ఎలాగైనా మంచి హిట్టు కొట్టాలని చూస్తున్నాడు షారుక్.
Read Also : Pawan Kalyan | పవన్ టార్గెట్ 2024..మరి సినిమాల సంగతేంటి..!