బాలీవుడ్లో మూడు దశాబ్దాలుగా పైగా కెరీర్ను సాగిస్తున్నారు షారుఖ్ ఖాన్ (Shahrukh khan). ఇప్పటికీ ఆయన స్టార్డమ్ చెదిరిపోలేదు. లాక్డౌన్ కారణంగా తను చేసే సినిమాల జోరు తగ్గినా, ఇప్పుడా గ్యాప్ ఫిలప్ చేసుకునేందుకు వరుసగా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. షారుఖ్ ఖాతాలో ప్రస్తుతం ‘పఠాన్’ , ‘జవాన్’, ‘డంకీ’ చిత్రాలున్నాయి. ఇవన్నీ వేటికవి భిన్నమైనవే కాక…భారీ మూవీస్ కూడా. దీంతో వచ్చే ఏడాది షారుఖ్ హవానే పాన్ ఇండియా స్థాయిలో సాగుతుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.
తాజాగా వారిని సంతోషపెట్టే మరో స్టేట్మెంట్ ఇచ్చారు షారుఖ్. ప్రస్తుతం సౌదీ అరేబియాలోని జెడ్డాలో రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొంటున్న షారుఖ్…తను వచ్చే పదేండ్ల పాటు ‘మిషన్ ఇంపాజిబుల్’ (Mission Impossible)తరహా చిత్రాలు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ సిరీస్గా ‘మిషన్ ఇంపాజిబుల్’ బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించింది. 1996లో మొదలైన ఈ సిరీస్…ఇప్పటికీ ఆరు పార్టుల సినిమాలను విడుదల చేసుకుంది.
ఏడో పార్ట్ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇలాంటి యాక్షన్ స్పై మూవీస్ చేస్తానని కింగ్ ఖాన్ చెప్పడం సినిమా మీద ఆయనకున్న ప్యాషన్ను చూపిస్తున్నది. రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో షారుఖ్తో పాటు ప్రియాంకా చోప్రా కూడా పాల్గొంటున్నది.
Read also :Pathaan | ఎనిమిది దేశాల్లో పఠాన్ యాక్షన్ సీన్లు షూట్.. మేకర్స్ స్టన్నింగ్ అప్డేట్
Read also : Uorfi Javed | నువ్వు నా దుస్తులతో పోటీపడలేవు.. సన్నీలియోన్ పొగడ్తలపై ఉర్ఫీ జావెద్
Read also :GautamGhattamaneni | స్టేజ్పై మహేశ్ బాబు కొడుకు గౌతమ్ యాక్టింగ్.. ట్రెండింగ్లో వీడియో