Shah Rukh Khan | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) తొలిసారి బిలియనీర్ల క్లబ్లో చేరారు. రూ.12,490 కోట్ల నెట్వర్త్తో తొలిసారి ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇక ఈ లిస్ట్లో ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా పేరుగాంచిన ముకేశ్ అంబానీనే టాప్లో ఉన్నారు.
M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 (Hurun India Rich List 2025) 14వ ఎడిషన్ ప్రకారం.. ముకేశ్ అంబానీ కుటుంబం భారత్లో అత్యంత సంపన్నులుగా నిలిచారు. అంబానీ ఫ్యామిలీ రూ.9.55 లక్షల కోట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత గౌతమ్ అదానీ (Gautam Adani), ఆయన కుటుంబం రూ.8.15 లక్షల కోట్లతో రెండోస్థానంలో నిలిచింది. ఇక ఈ జాబితాలో రోష్ణి నాదర్ మల్హోత్రా, ఆమె కుటుంబం తొలిసారి మూడోస్థానంలోకి వచ్చింది. రూ.2.84 లక్షల కోట్లతో ఆమె భారత్లో అత్యంత ధనవంతురాలైన మహిళగా నిలిచారు.
కాగా, భారత్లో బిలియనీర్ల సంఖ్య పెరుగుతోందని సదరు నివేదిక సూచిస్తోంది. ప్రస్తుతం దేశంలో మొత్తం బిలియనీర్ల సంఖ్య 350 దాటింది. 13 సంవత్సరాల క్రితం ఈ జాబితా ప్రారంభమైనప్పటి నుంచి బిలియనీర్ల సంఖ్య ఆరు రెట్లు పెరిగింది. ఇక మొత్తం బిలియనీర్ల విలువ రూ.167 లక్షల కోట్లుగా ఉంది. ఇది భారత్ జీడీపీలో దాదాపు సగం.
దేశంలో యువ బిలియనీర్ల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నట్లు సదరు నివేదిక వెల్లడించింది. తాజాగా పెర్ప్లెక్సిటీ వ్యవస్థాపకుడు 31 ఏళ్ల అరవింద్ శ్రీనివాస్ రూ. 21,190 కోట్ల సంపదతో భారత్లోనే అతి పిన్న వయస్కుడైన బిలియనీర్గా నిలిచారు. భారత్లో బిలియనీర్ల సంఖ్యలో ముంబై అగ్రస్థానంలో నిలిచింది. ముంబై నగరంలో దాదాపు 451 మంది సంపన్న వ్యక్తులు జీవిస్తున్నారు. ఆ తర్వాత న్యూఢిల్లీలో 223, బెంగళూరులో 116 మంది అత్యంత ధనవంతులు ఉన్నారు.
Also Read..
DA Hike | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. డీఏ 3 శాతం పెంపుకు కేబినెట్ ఆమోదం
Actor Vijay | టీవీకే విజయ్ కీలక నిర్ణయం.. రాష్ట్రవ్యాప్త పర్యటన వాయిదా