Shah Rukh Khan – SS Rajamouli | ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli), బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారుక్ ఖాన్ (Shah Rukh Khan) అరుదైన ఘనత సాధించారు. 2023కు గానూ ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ (Time magazine) రిలీజ్ చేసిన ‘100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2023’ (100 most influential people of 2023) జాబితాలో చోటు దక్కించుకున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి వీరిద్దరికే ఈ అవకాశం దక్కడం విశేషం.
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. ‘బాహుబలి’, ‘బాహుబలి-2’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్ల రాబట్టడంతోపాటు ఎన్నో అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. ఆ చిత్రంలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకు ప్రతిష్ఠాత్మక ‘ఆస్కార్’ అవార్డు వరించింది. ఇక షారుక్.. రీసెంట్గా హిందీ యాక్షన్ థ్రిల్లర్ ‘పఠాన్’ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన విషయం తెలిసిందే. విడదలకు ముందు ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువైన ఈ సినిమా.. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది.
కాగా, పలు రంగాలకు చెందిన సెలబ్రిటీలు, ప్రముఖులతో కూడిన జాబితాను ‘టైమ్స్’ గురువారం విడుదల చేసింది. రాజమౌళి, షారుక్తోపాటు మరికొంతమందికి ఈ లిస్ట్లో చోటు దక్కింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, హాలీవుడ్ తార ఏంజెలా బాసెట్, ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ, న్యాయనిర్ణేత పద్మలక్ష్మి తదితరులు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన వంద మంది వ్యక్తులు జాబితాలో చోటు దక్కించుకున్నారు.
Also Read..
India Corona | డేంజర్ బెల్స్.. 11 వేలకు పైనే కొత్త కేసులు.. 29 మరణాలు
Texas Dairy farm | డెయిరీ ఫామ్లో అగ్ని ప్రమాదం.. 18 వేల గోవులు ఆహుతి