karnataka assembly elections | మరికొన్ని రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు (karnataka assembly elections ) జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ రోజుకో సంచలనం నమోదవుతోంది. ఈ సారి తప్పనిసరిగా టికెట్లు వస్తాయని అనుకున్న కొందరు నేతలకు అధికార బీజేపీ సహా ప్రతిపక్ష కాంగ్రెస్ షాకిచ్చింది. దీంతో నిరాశకు గురైన కొందరు నేతలు పార్టీలు మారేందుకు, రెబల్స్గా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించిన ఓ కోటీశ్వరుడు ఇప్పుడు తన భార్యను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నాడు.
కర్ణాటక రాష్ట్రంలోని కోటీశ్వరుల్లో కేజీఎఫ్ (KGF) వాసి యూసుఫ్ షరీఫ్ (Yusuf Sharif) అలియాస్ కేజీఎఫ్ బాబు (KGF Babu) ఒకరు. గుజిరీ వ్యాపారాన్ని ప్రారంభించి రూ.కోట్లకు పడగలెత్తిన ఆయన.. కేజీఎఫ్ బాబుగా ప్రజల్లో గుర్తింపుపొందారు. కేజీఎఫ్ బాబు రెండేండ్ల క్రితం కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఎన్నికల సమయంలో ఆయన తన ఆస్తిని రూ.1,743 కోట్లుగా ప్రకటించి సంచలనం సృష్టించారు.
అయితే, ఈ ఎన్నికల్లో చిక్క పేట (Chikkapet constituency) నుంచి పోటీ చేయాలని భావించారు. ఇందులో భాగంగా తనకు చిక్కపేట స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన కాంగ్రెస్ నేతలను కోరుతూ వచ్చారు. కానీ, అలాంటి అవకాశం ఇవ్వకపోగా, పార్టీ నేతల్లో నెలకొన్న విభేదాల కారణంగా ఏకంగా ఆయనపై సస్పెండ్ వేటు వేసింది. ఈ నేపథ్యంలో ఆయన తన భార్య షాజియాను స్వతంత్ర అభ్యర్థిగా తను కోరుకున్న స్థానం నుంచి బరిలోకి దించుతున్నారు. ఇందుకోసం ఆమె గురువారం నామినేషన్ పత్రాలను కూడా దాఖలు చేశారు. తన భర్త బాబు, కుమార్తెతో కలిసి నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
Also Read..
India Corona | డేంజర్ బెల్స్.. 11 వేలకు పైనే కొత్త కేసులు.. 29 మరణాలు
Prakash Ambedkar | హుజూరాబాద్లో దళితబంధు లబ్దిదారులతో ముచ్చటించనున్న ప్రకాశ్ అంబేద్కర్
Texas Dairy farm | డెయిరీ ఫామ్లో అగ్ని ప్రమాదం.. 18 వేల గోవులు ఆహుతి