కరీంనగర్: దేశంలోనే ఎత్తయిన అంబేద్కర్ (BR Ambedkar) విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్లోని హుస్సెన్సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల ఎత్తయిన బాబాసాహెబ్ విగ్రహాన్ని శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మనుమడు, మాజీ ఎంపీ ప్రకాశ్ అంబేద్కర్ (Prakash Ambedkar) ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. అయితే శుక్రవారం ఉదయం ఆయన హుజూరాబాద్లో (Huzurabad) దళితబందు (Dalit bandhu) లబ్దిదారులను కలువనున్నారు. వారి అనుభవానలు, దళితబంధు ద్వారా వారి జీవితాల్లో వచ్చిన మార్పులను గురించి తెలుసుకోనున్నారు.
ఇందులో భాగంగా ప్రకాశ్ అంబేద్కర్ కరీంనగర్ చేరుకున్నారు. ఆయనకు మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) సాదర స్వాగతం పలికారు. దళితబంధు జ్ఞాపికను అందజేశారు. మంత్రి గంగులతోపాటు విప్ బాల్క సుమన్ (Balka Suman) ఇతర ఉన్నతాధికారులతో కలసి ప్రకాశ్ అంబేద్కర్ హుజూరాబాద్ చేరుకుంటారు. అనంతరం ఆయన హైదరాబాద్కు చేరుకుంటారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.