నాగచైతన్య (Naga Chaitanya)తో విడాకుల తర్వాత మానసిక ప్రశాంతత కోసం కొన్ని రోజులుగా ఆధ్యాత్మిక వేటలో మునిగిపోయింది టాలీవుడ్ హీరోయిన్ సమంత (Samantha). ఇటీవలే తన స్నేహితురాలు శిల్పారెడ్డి (shilpareddy)తో కలిసి చార్ధామ్ యాత్ర (CharDhamYatra)కు వెళ్లింది సామ్. సోషల్మీడియాలో ప్రతీ రోజు తన యాక్టివిటీస్ గురించి చెప్తూ మళ్లీ మునుపటిలా మారిపోయేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ఓ సెల్ఫీని సోషల్మీడియాలో పోస్ట్ చేసింది.
సమంత జాలువారుతున్నట్టుగా ఉన్న కురులతో..మనస్ఫూర్తిగా సంతోషంగా నవ్వుతూ హ్యాపీ మూడ్లో పాజిటివ్ వైబ్స్ (positive vibes) అందించేలా ఉన్నస్టిల్ ను అందరితో పంచుకుంది. హలో గ్లో (మెరుపు)..నేను నిన్ను మిస్సయ్యాను..అని క్యాప్షన్ పెట్టింది సామ్. పాజిటివ్ వైబ్స్ తో తన డే ఎలా మొదలైందో చెబుతూ సమంత పోస్ట్ చేసిన స్టిల్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
అద్భుతమైన CharDhamYatra యాత్ర ముగిసింది. హిమాలయాల పట్ల నేనెప్పుడూ ఆకర్షితురాలినయ్యాను..మహాభారతం చదివినప్పటి నుండి భూమిపై ఉన్న ఈ స్వర్గాన్ని సందర్శించడం ఒక కల అంటూ తన యాత్ర గురించి ఇప్పటికే సామ్ పోస్ట్ పెట్టగా ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Charmy Kaur | యాక్టింగ్లోకి రీఎంట్రీపై ఛార్మీ ఏమన్నదంటే..?
Rakul Preet Singh | రకుల్ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం
Pramod: ముంబైలో పూరీని చూసి ఏడ్చేసిన అభిమాని