టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ముంబైలో ఇంటి కోసం వెతుకుతుందని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్లో తన కెరీర్ను బిల్డప్ చేసుకునే క్రమంలో ముంబైకి మకాం మార్చేసేందుకు రెడీ అయిందని న్యూస్ తెరపైకి వచ్చింది. కాగా ఇపుడు మరో విషయం ఇండస్ట్రీ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఈ బ్యూటీ అనధికారికంగా ముంబై (Mumbai)కి మారిపోయిందన్న వార్త ఇపుడు హల్చల్ చేస్తోంది. సామ్ ప్రస్తుతం హిందీ వెబ్సిరీస్తోపాటు హాలీవుడ్ ప్రాజెక్టు చేస్తోంది.
ముంబై కేంద్రంగానే ఈ ప్రాజెక్టుల షూటింగ్స్ కు హాజరవుతుందట. షూటింగ్ షెడ్యూల్ లో ఏ మాత్రం విరామం దొరికినా కేవలం ముంబైలోని విశ్రాంతి తీసుకుంటుందని టాక్ నడుస్తోంది. ఇక హైదరాబాద్లో ప్లే స్కూల్, క్లాతింగ్ బ్రాండ్ సేల్స్, ఆర్గానిక్ ఫామింగ్ కంపెనీ లావాదేవీలను చూసుకునేందుకు మాత్రమే అవసరాన్ని బట్టి హైదరాబాద్కు వచ్చి వెళ్తుందట సమంత . ప్రస్తుతం విజయ్ దేవరకొండ-శివ నిర్వాణ కాంబో సినిమా ఖుషీలో ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది.
రీసెంట్గా కశ్మీర్ తొలి షెడ్యూల్ పూర్తి చేసి..కాస్త బ్రేక్ తీసుకుంది సామ్. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టుతో వస్తున్న యశోద ఫైనల్ షెడ్యూల్పై ఫోకస్ పెట్టనుందని తెలుస్తోంది. మొత్తానికి సామ్ ఓ వైపు హైదరాబాద్,మరోవైపు ముంబై మధ్య చక్కర్లు కొడుతూ ఫుల్ బిజీ అయిపోయిందంటున్నారు సినీ జనాలు.