సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమాతో మంచి బ్రేక్ అందుకున్నాడు డైరెక్టర్ పరశురాం (Parasuram). ఈ టాలెంటెడ్ డైరెక్టర్ యంగ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya)తో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇన్ సైడ్ టాక్ ప్రకారం సర్కారు వారి పాట కంటే ముందే పరశురాం చైతూ సినిమాను ఫైనల్ చేశాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో సినిమా ఉండబోతుందని క్లారిటీ కూడా ఇచ్చేశాడు. కానీ మహేశ్ బాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆ ప్రాజెక్టుపైనే ఫోకస్ పెట్టాడట. ఇపుడు సినిమా పూర్తయింది.
చైతూ సినిమా షురూ చేసేందుకు అంతా రెడీ అయింది.అయితే నాగచైతన్య ప్రస్తుతం చేస్తున్న సినిమాల కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో చేయబోయే ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాతే మరో మూవీపై ఫోకస్ పెట్టాలనుకుంటున్నాడట. ఈ లెక్కన డైరెక్టర్ పరశురాంను వెయిటింగ్ లిస్టులో పెట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి. మరి పరశురాం-చైతూ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కనుందనేది తెలియాలంటే మరికొంత కాలం పట్టే అవకాశాలున్నాయని తాజా టాక్.
చైతూతో చేయబోయే సినిమాకు నాగేశ్వర్ రావు అనే టైటిల్ ఫైనల్ చేశాడని ప్రచారం నడుస్తుండగా..దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మనం ఫేం విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ సినిమా చేస్తున్నాడు చైతూ. మరోవైపు ధూత అనే వెబ్సిరీస్ కూడా చేస్తున్నాడు. హార్రర్ థ్రిల్లర్గా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో పార్వతి తిరువొతు, ప్రియా భవాణి శంకర్, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ కీ రోల్స్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తోన్న లాల్ సింగ్ ఛద్దాలో కీ రోల్ పోషిస్తున్నాడు.
Read Also : Hari Hara Veera Mallu | ‘హరిహరవీరమల్లు’తో పవన్ అప్సెట్..కారణమేంటో..?
Read Also : kamal haasan | కమల్ హాసన్ను కలిసిన నితిన్ తండ్రి..ప్రమోషన్ ప్లాన్పై చర్చ..!