చిరంజీవి సినిమాలో నటించే అవకాశం ఎప్పుడెప్పుడు వస్తుందా అని హీరోయిన్లు వేచి చూస్తూ ఉంటారు. కానీ వచ్చిన అవకాశాన్ని వదులుకొని కొందరు ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అలా వచ్చిన ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్ సాయిపల్లవి. తనకు కథ నచ్చకపోతే చిరంజీవి అయినా పెద్దగా పట్టించుకోదు. ఈ నేపథ్యంలోనే మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో ముందు ఈమెను కీలక పాత్ర కోసం తీసుకున్నారు. తమిళంలో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ ఇది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నాడు.
వీలైనంత తక్కువ బడ్జెట్లో ఈ సినిమాను తెరకెక్కించాలని దర్శకుడు మెహర్ రమేష్ కు ఇప్పటికే చిరంజీవి చెప్పేశాడు. ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లెలి పాత్రకు సాయి పల్లవిని ముందుగా ఎంపిక చేశారు. అయితే అందులో నటించడానికి ఆమె నో చెప్పింది. దాంతో కీర్తి సురేశ్ను ఈ పాత్ర కోసం ఎంపిక చేశారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో సాయిపల్లవి ఎందుకు నటించడం లేదు అనే ప్రశ్నకు సమాధానం మాత్రం చాలా రోజులుగా ఎవరికీ తెలియలేదు. తాజాగా లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో దీనికి సమాధానం చెప్పేసింది సాయి పల్లవి. తనకు రీమేక్ సినిమాలు అంటే భయం అని.. అందుకే చిరంజీవి సినిమాలో నటించే అవకాశం వచ్చినా కూడా వదిలేశాను అంటుంది సాయి పల్లవి. తనకు ఇంకో అవకాశం ఇవ్వాలి అంటూ మీడియా ముఖంగా స్టేజీపైన చిరంజీవిని కోరింది ఈ భామ. మరోవైపు తన సినిమా సాయి పల్లవి రిజెక్ట్ చేయడం ఆనందంగా అనిపించింది అని తెలిపాడు చిరంజీవి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆ విషయంలో మా అమ్మ చెప్పినా వినను.. ఓపెన్ అయిన రష్మిక
చీరలు అంటే చాలా ఇష్టమే.. కానీ అదొక్కటే సమస్య అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్
Siri: సిరి షర్ట్ లోపల చేయి పెట్టిందెవరు.. వీడియో చూపించి గుట్టు విప్పిన నాగ్
తల్లిదండ్రులపై కేసు పెట్టిన తమిళ హీరో విజయ్.. కారణం ఏంటంటే..