1990లలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా వస్తున్న చిత్రం విరాటపర్వం (Virataparvam). నీది నాది ఒకే కథ ఫేం వేణు ఊడుగుల (Venu Udugula) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో విప్లవ నేత రవన్నగా రానా (Rana Daggubati) నటిస్తుండగా..సాయిపల్లవి (Sai Pallavi) సరళ అనే యువతి (నిజ జీవిత పాత్ర) పాత్ర స్పూర్తిగా సాగే వెన్నెల రోల్లో నటిస్తోంది. ఆదివారం వరంగల్లో విరాట పర్వం టీం ఆత్మీయ వేడుకను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో నటీనటులు సందడి చేశారు.
ఈ సందర్బంగా విరాటపర్వం టీం పట్టణంలోని సరళ నివాసానికి వెళ్లి..ఆమె కుటుంబసభ్యులను కలిసింది. విరాటపర్వం టీంకు ఘనంగా స్వాగతం పలికింది సరళ కుటుంబం. సాయిపల్లవిని చూడగానే సరళ తల్లి చాలా భావోద్వేగానికి లోనయ్యారు. తన సొంత కూతురే ఇంటికి వచ్చేసిందన్నంత సంతోషంలో మునిగిపోయారు కంటతడి పెట్టారు.
ఇక సంప్రదాయబద్దంగా కూతురు ఇంటికొచ్చినపుడు చేసినట్టుగానే సాయిపల్లవికి సరళ తల్లి చీరను బహూకరించారు. మరోవైపు సరళ కుటుంబసభ్యులతో మాట్లాడిన సమయంలో సాయిపల్లవి చాలా ఎమోషనల్ అయిపోవడమే కాకుండా కంటతడి కూడా పెట్టింది. ఇపుడీ ఫొటోలు ఆన్ లైన్లో వైరల్ అవుతున్నాయి.
ఈ చిత్రంలో నవీన్చంద్ర, సాయిచంద్, జరీనా వహబ్, ఈశ్వరీరావు, నందితా దాస్, నివేదా పేతురాజ్, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీరియాడిక్ డ్రామా బ్యాక్ డ్రాప్లో సాగే ఈ చిత్రాన్ని సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేశ్ బొబ్బిలి మ్యూజిక్ డైరెక్టర్. జూన్ 17న థియేటర్లలో సందడి చేయనుంది.
#VirataParvam is based on shockingly true incidents inspired by a woman's life from Warangal. #SaiPallavi is playing the character "Vennela" as an ode to the girl who has changed the perception of love in Revolution. pic.twitter.com/9EOhHXf9bU
— SLV Cinemas (@SLVCinemasOffl) June 13, 2022