తెలుగు, మలయాళ, తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు సాయిపల్లవి (Sai Pallavi). శ్యామ్ సింగ రాయ్ సినిమాతో నార్తిండియా ప్రేక్షకులకు కూడా దగ్గరైంది ఈ భామ. భాష, హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తీరిక లేకుండా ఉంది. రీసెంట్గా రానాతో కలిసి విరాటపర్వం (Virata Parvam) సినిమా చేసింది. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ను అందుకోలేకపోయినా..విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఈ చిత్రంలో రవన్న తల్లి రాసిన ఉత్తరాన్ని అతన్ని కలిసి అందించేందుకు వెన్నెల చాలా రిస్క్ చేస్తుంది. అయితే నిజజీవితంలో లవ్ లెటర్ (love letter) ఏదైనా రాసే ప్రయత్నం చేశారా..అన్న ప్రశ్నపై ఓ యూ ట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ..చిన్ననాటి సంఘటన ఒకటి షేర్ చేసుకుంది..సాయిపల్లవి స్కూల్ స్టేజ్లో ఓ అబ్బాయికి రాసిన లవ్ లెటర్ ఆమె తల్లిదండ్రుల కంట పడిందట. నా చిన్న తనంలో ఓ అబ్బాయికి లేఖ రాశాను. అపుడు నేను ఏడో తరగతిలో ఉన్నాననుకుంటా. ఈ విషయం తెలిసి అమ్మానాన్న నన్ను చాలా బాగా కొట్టారు.
సాయిపల్లవి ప్రస్తుతం గార్గి సినిమాలో నటిస్తోంది. గౌతమ్ రామచంద్రన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రంలో స్కూల్ టీచర్గా కనిపించనుంది. జులై 15న థియటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. విరాటపర్వం జులై 1 నుంచి నెట్ఫ్లిక్స్ లో ప్రీమియర్ అవుతోంది.