టాలీవుడ్ (Tollywood) టాలెంటెడ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi) లాంగ్ గ్యాప్ తర్వాత రంగమార్తాండ (Rangamarthanda) సినిమాతో రాబోతున్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరాఠి చిత్రం నటసామ్రాట్కు తెలుగు రీమేక్గా వస్తున్న ఈ చిత్రం ఆగస్టులో థియేటర్లలో సందడి చేయనుంది. కాగా ఈ ప్రాజెక్టు విశేషాలను ఓ చిట్ చాట్ సెషన్ లో పంచుకున్నాడు కృష్ణవంశీ. భావోద్వేగపూరితంగా సినిమాతో తన ప్రయాణం కొనసాగిందని అన్నాడు.
అంతేకాదు ఈ సినిమా చేస్తున్నపుడు తన ప్రమేయం లేకుండానే 7-8 సార్లు కన్నీళ్లు వచ్చేశాయని చెప్పాడు. ఈ సినిమాలో ప్రజలు డబ్బు కోసం పరుగులు పెడుతూ..ప్రకృతిని, సమాజాన్ని నాశనం చేయడం ద్వారా తమను తాము ఏవిధంగా కోల్పోతున్నారో చిత్రీకరించే బలమైన కథాంశం ఉంటుందన్నాడు కృష్ణవంశీ. ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తున్న విషయం తెలిసిందే. రంగమార్తాండకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.
ఈ మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్టులో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.