టాలీవుడ్ (Tollywood)లో మోస్ట్ క్రేజీ కాంబినేషన్ మహేశ్ బాబు (Mahesh Babu)-త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). ఈ కాంబోలో రాబోతున్న ప్రాజెక్టు ఎస్ఎస్ఎంబీ 28 (SSMB28). చాలా కాలంగా మహేశ్ బాబు అభిమానులు ఎదురుచూస్తున్న అప్ డేట్ రానే వచ్చేసింది. ఆగస్టులో షూటింగ్ షురూ కానున్నట్టు ఇప్పటికే ఓ అప్ డేట్ బయటకు వచ్చింది. కాగా ఇపుడు ఈ క్రేజీ సినిమాకు మహేశ్ తీసుకుంటున్న పారితోషికం అంశం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
బాక్సాపీస్ వద్ద హిట్టు, ప్లాపు మాటెలా ఉన్నా..రెమ్యునరేషన్ విషయంలో మాత్రం మహేశ్ బాబు ఏ మాత్రం కాంప్రమైజ్ అవడని ఓ టాక్ ఉంది. సర్కారు వారి పాట చిత్రం బాక్సాపీస్ వద్ద ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. ఈ చిత్రానికి మహేశ్ రూ.50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు ఇప్పటివరకున్న టాక్. కాగా ఇపుడు త్రివిక్రమ్తో చేయబోయే సినిమాకు పారితోషికాన్ని పెంచేశాడన్న వార్త హాట్ టాపిక్గా మారింది.
తాజా గాసిప్ ప్రకారం మహేశ్ ఏకంగా ఈ చిత్రానికి రూ.70 కోట్లు తీసుకుంటున్నాడన్న వార్త గురించి ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చర్చించుకుంటున్నారు. పారితోషికం విషయంలోనే ఇప్పటివరకు సినిమా ఆలస్యమవుతూ వచ్చిందట. ఫైనల్గా నిర్మాత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) మహేశ్ డిమాండ్కు ఓకే చెప్పాడని తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొత్తానికి రెమ్యునరేషన్ టాపిక్పై మహేశ్ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.