Sabdham Movie | కోలీవుడ్ దర్శకుడు అరివళగన్, నటుడు ఆది పినిశెట్టి, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఈరం (తెలుగులో ‘వైశాలి’). 2009లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక ఈ సినిమాతోనే థమన్కు సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు లభించింది. అయితే దాదాపు 14 ఏండ్ల తరువాత ఈ ట్రయో మళ్లీ రిపీట్ అవుతుంది. చాలా గ్యాప్ తర్వాత అరివళగన్, ఆది పినిశెట్టి కాంబోలో వస్తున్న చిత్రం ‘శబ్దం'(Sabdham). ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. లక్ష్మీమీనన్ కథనాయికగా నటిస్తుండగా.. ఈ మూవీతోనే అరివళగన్ నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నాడు. హార్రర్ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే మూవీ నుంచి చిత్రయూనిట్ సాలిడ్ అప్డేట్ ఇచ్చింది.
ఈ సినిమా ఫస్ట్ లుక్ను డిసెంబర్ 14న సోషల్ మీడియా వేదికగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక అరివళగన్ ఆల్ఫా ఫ్రేమ్స్, 7జీ ఫిలింస్ శివ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
#Vaishali Trio @dirarivazhagan and @AadhiOfficial & @MusicThaman is back 🌊 A Spine-chilling symphony that echoes through the depths of sound horror!
Prepare your eyes for a spooky symphony, First look on 14th December 2023! Stay stuned✨
Produced by @7GFilmsSiva… pic.twitter.com/wSIM1yDtMn
— Vamsi Kaka (@vamsikaka) December 13, 2023
మరోవైపు.. ఈ సినిమాలో సీనియర్ నటి లైలా ఓ కీలక పాత్రలో నటిస్తుంది. కొన్నేళ్ల క్రితం తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్గా నటించి ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన లైలా.. చాలా గ్యాప్ తర్వాత ఇటీవల కార్తీ హీరోగా నటించిన సర్దార్ మూవీలో ముఖ్యపాత్రలో మెరిసింది. తాజాగా ఆది పినిశెట్టి, అరివళగన్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించనుంది.