‘సప్త సాగరదాచే ఎల్లో’ చిత్రం ద్వారా కన్నడంలో మంచి గుర్తింపును సంపాదించుకుంది రుక్మిణి వసంత్. తెలుగులో ఈ చిత్రం ‘సప్తసాగరాలు దాటి’ పేరుతో విడుదలైన ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రుక్మిణి అందంతో పాటు తనదైన అభినయంతో మెప్పించింది. ప్రస్తుతం ఈ భామకు కన్నడ ఇండస్ట్రీలో భారీ అవకాశాలొస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ భామ తెలుగులో రవితేజ సరసన నటించబోతున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. యువ దర్శకుడు అనుదీప్ కేవీతో రవితేజ ఓ చిత్రాన్ని చేయబోతున్నారని తెలిసింది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ను నాయికగా ఖరారు చేయబోతున్నారని తెలిసింది. కామెడీ యాక్షన్ ఎంటర్రైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది. ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ చిత్రంలో కూడా నాయికగా రుక్మిణి వసంత్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.