బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు టైగర్ 3. మనీశ్ శర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్టులో ఇమ్రాన్ హష్మీ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. త్వరలోనే ముంబైలోని యశ్ రాజ్ ఫిలిమ్స్ స్టూడియోలో టైగర్ 3 చిత్రీకరణ షురూ కానుంది. ఈ క్రేజీ మూవీకి సంబంధించిన అప్డేట్ ఒకటి బీటౌన్ లో చక్కర్లు కొడుతోంది. ఇమ్రాన్ హష్మీ ఎంట్రీ సీన్ ను చాలా రిచ్ గా డిజైన్ చేశారట.
విలన్ గా ఇమ్రాన్ హష్మీ ఎంట్రీ సీన్ ఎపిసోడ్ కోసం మేకర్స్ ఏకంగా రూ.10 కోట్లు ఖర్చు చేయబోతున్నారనే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ పాకిస్థాన్ ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ టైగర్ 3ను నిర్మిస్తోంది. టైగర్ ప్రాంఛైజీలో వస్తున్న ఈ సీక్వెల్లో కత్రినాకైఫ్ మరోసారి సల్మాన్ ఖాన్ తో రొమాన్స్ చేయబోతుంది.
సల్మాన్ ఖాన్ సినిమా అంటే ఆడియెన్స్ లో క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి ఒక్క ఇమ్రాన్ హష్మీ ఎపిసోడ్ కే ఇంత ఖర్చు పెడుతున్నారన్న వార్త టైగర్ 3పై అంచనాలను మరింత పెంచేస్తుంది.
ఇవి కూడా చదవండి..
మరోసారి స్పెషల్ సాంగ్ లో తమన్నా..!
ఆర్ఆర్ఆర్ షూటింగ్ లేటెస్ట్ అప్ డేట్
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
వ్యాక్సిన్ వేయించుకున్న పూజాహెగ్డే.. స్టిల్ వైరల్