ఇటీవల జారీచేసిన కొత్త జీవో ప్రకారం..ఆర్ఆర్ఆర్ మేకర్స్ (RRR)ఏపీ ప్రభుత్వానికి (AP Government) బడ్జెట్ లెక్కలు సమర్పించారు. హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్లతో కలిపి ఆర్ఆర్ఆర్ బడ్జెట్ మొత్తం రూ.478 కోట్లుగా నివేదికలో మేకర్స్ పేర్కొన్నారు. రెమ్యునరేషన్లు, జీఎస్టీ మినహాయిస్తే రూ.336 కోట్లు అని తెలిపారు. రాజమౌళి నెలవారి జీతం తీసుకున్నాడని, వచ్చిన లాభాల్లో దర్శకనిర్మాతలకు 50-50 శాతంగా నిర్ణయించినట్టు తెలిపారు.
ఈ సినిమా కోసం డైరెక్టర్ రాజమౌళి పన్నెండేళ్ల క్రితం అడ్వాన్స్ తీసుకున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు ఏపీలో సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టికెట్పై మరో రూ.75 పెంచేందుకు అనుమతివ్వగా.. మొదటి 10 రోజులపాటు పెంచిన ధర అమలులో ఉండనున్నాయి.
రాంచరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (Jr NTR) కాంబినేషన్లో వస్తున్న ఆర్ఆర్ఆర్ (RRR) మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. రాంచరణ్ (Ram Charan) అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తుండగా..ఎన్టీఆర్ (Jr NTR) కొమ్రం భీమ్ రోల్లో కనిపించబోతున్నాడు. బాలీవుడ్ నటులు అజయ్ దేవ్గన్, అలియాభట్, శ్రియా శరణ్, హాలీవుడ్ భామ ఒలీవియా మొర్రీస్, కోలీవుడ్ నటుడు సముద్రఖని కీ రోల్స్ పోషిస్తున్నారు.