సినీ ఇండస్ట్రీని రికార్డులతో షేక్ చేసిన చిత్రాల్లో ఒకటి రోబో (Robo). శంకర్-రజినీకాంత్ (Rajinikanth) కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai) ఫీ మేల్ లీడ్ రోల్ పోషించింది. ఒక్క సినిమాతోనే సిల్వర్ స్క్రీన్పై అదిరిపోయే కాంబినేషన్గా నిలిచింది రజినీ-ఐష్ పెయిర్. కాగా ఈ ఇద్దరు స్టార్ సెలబ్రిటీలు మళ్లీ కలిసి నటించబోతున్నారన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. దశాబ్దకాలం తర్వాత మళ్లీ దక్షిణాది సినిమా(south cinema ) లోకి రీఎంట్రీ ఇస్తోంది ఐష్.
తాజా సమాచారం ప్రకారం రజినీకాంత్ 169వ (#Thalaivar169) చిత్రంలో ఐశ్వర్యారాయ్ హీరోయిన్గా కనిపించబోతుంది. బీస్ట్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. బీస్ట్ సినిమా బాక్సాపీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో రజినీకాంత్ పునరాలోచనలో పడ్డాడని గాసిప్స్ తెరపైకి వచ్చాయి. అయితే వాటిన్నింటికి తెరదించుతూ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు రజినీ అండ్ నెల్సన్.
ఈ ప్రాజెక్టులో సీనియర్ నటి రమ్యకృష్ణ, గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఐశ్వర్యారాయ్, రమ్యకృష్ణలాంటి టాలెంటెడ్ నటీమణుల కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్పై అదిరిపోవడం ఖాయమంటున్నారు సినీ జనాలు.