టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand), కృష్ణచైతన్య (Krishna Chaitanya) డైరెక్షన్లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫాక్టరీ (Peoples Media Factory) నిర్మాణంలో ఈ మూవీ రాబోతుంది. కాగా ఈ చిత్రంలో రాశీఖన్నా (Raashi Khanna) శర్వానంద్తో రొమాన్స్ చేయబోతుందని ఇప్పటికే ఓ అప్డేట్ కూడా తెరపైకి వచ్చింది. కాగా ఇపుడు మరో క్రేజీ న్యూస్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారని లేటెస్ట్ టాక్.
ఇంతకీ మరో ఫీ మేల్ లీడ్ రోల్లో ఎవరు కనిపించబోతున్నారనే కదా మీ డౌటు. సీనియర్ నటి ప్రియమణి మరో హీరోయిన్గా కనిపించబోతుందన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రం ఆగస్టులో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తాజా సమాచారం. రానున్న రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు తెరపైకి రానున్నాయి.
ఇక శర్వానంద్ ఈ సినిమా కోసం మేకోవర్ మార్చుకునే పనిలో ఉన్నాడని, మేకోవర్ పూర్తయిన వెంటనే సినిమా షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది. కృష్ణచైతన్య గతంలో యువ హీరో నితిన్తో పవర్ పేట్ సినిమా ప్రకటించగా..అనివార్య కారణాల వల్ల అటకెక్కింది. రాశీఖన్నా నటిస్తోన్న పక్కా కమర్షియల్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రియమణి కీ రోల్ లో నటించిన విరాటపర్వం జూన్ 17న రాబోతుంది.