గత కొద్ది కాలంగా తాను హృదయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నానని నటి రేణు దేశాయ్ తెలిపింది. హృద్రోగంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలకు చికిత్స తీసుకుంటున్నట్లు తాజా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఆమె వెల్లడించింది. ప్రస్తుతం రేణు దేశాయ్ రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో సామాజిక ఉద్యమకారిణి హేమలతా లవణం పాత్రలో నటిస్తున్నది.
రేణు దేశాయ్ స్పందిస్తూ…‘కొన్నేండ్లుగా నేను హృదయానికి సంబంధించిన వ్యాధితో పాటు ఇతర కొన్ని రుగ్మతలతో బాధపడుతున్నా. నాలాగే అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి మానసిక ైస్థెర్యాన్ని ఇచ్చేందుకే నేనీ పోస్ట్ చేస్తున్నా. జీవితంలో ఏం జరిగినా అధైర్యపడకండి. ఈ విశ్వం మీ కోసం ఓ మంచి ప్రణాళికతో ఉంటుందని నమ్మండి. నా వ్యాధికి చికిత్స తీసుకుంటున్నా. త్వరలోనే ఆరోగ్యంగా మారి షూటింగ్లకు హాజరవుతాను’ అని పేర్కొంది.