భారతీయుడు, జెంటిల్మెన్, భారతీయుడు లాంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను సినీ లవర్స్ కు అందించాడు శంకర్ (Shankar) . ఈ స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం టాలీవుడ్ హీరో రాంచరణ్ (Ram Charan)తో ఆర్సీ 15 (RC15)ప్రాజెక్టు చేస్తున్నాడు. ఈ చిత్రానికి సర్కారోడు అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్టు వార్తలు రాగా..దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ఆర్సీ 15 కొత్త షెడ్యూల్ మొదలుపెట్టింది శంకర్ అండ్ రాంచరణ్ టీం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇవాళ అమృత్సర్లో మొదలైంది.
ఇక ఈ చిత్రంలో రాంచరణ్ రెండు పాత్రల్లో కనిపించనుండగా..ఇందులో ఒక రోల్ స్టూడెంట్. కాలేజీ సన్నివేశాలను అమృత్సర్లో చిత్రీకరిస్తున్నారు. తాజా షెడ్యూల్లో రాంచరణ్, కియారా అద్వానీ (Kiara Advani), వెన్నెల కిశోర్, నవీన్ చంద్ర, ప్రియదర్నిపై వచ్చే సీన్లను షూట్ చేయబోతున్నట్టు టాక్. ఏప్రిల్ 14వరకు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సునీల్, శ్రీకాంత్, జయరామ్, రాజోలు సుందరి అంజలి కీ రోల్స్ పోషిస్తున్నారు.
రాంచరణ్ మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో కీ రోల్ లో నటిస్తున్న ఆచార్య ఏప్రిల్ 29న గ్రాండ్గా విడుదల కానుంది. ఈ మూవీలో రాంచరణ్కు జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది.