రేసు గుర్రం సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు నటుడు, ఎంపీ రవికిషన్ (Ravi Kishan). రవికిషన్ తన స్నేహితుడిపై ఫిర్యాదు చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. గోరఖ్పూర్ ఎంపీగా ఉన్న రవికిషన్ 2012లో తన స్నేహితుడు, ముంబైకి చెందిన వ్యాపారవేత్త అయిన జైన్ జితేంద్ర రమేశ్ (Jain Jitendra Ramesh)కు 3.25 కోట్లు ఇచ్చారు.
జైన్ జితేంద్ర రమేశ్ ఆ నగదును తిరిగివ్వడంలో భాగంగా రవికిషన్కు రూ.34 లక్షల చొప్పున 12 చెక్కులను అందజేశాడు. అయితే రవికిషన్ వాటిలో ఒక చెక్కును గతేడాది డిసెంబర్ 7న గోరఖ్పూర్ ఎస్బీఐ బ్రాంచ్ (Gorakhpur SBI Branch)లో డిపాజిట్ చేశారు. కానీ ఆ చెక్కు బౌన్స్ అయింది. ఆ తర్వాత రవికిషన్ స్నేహితుడు జైన్ జితేంద్ర రమేశ్కు తరచూ ఫోన్ చేసినా సరైన సమాధానం ఇవ్వలేదు.
జైన్ జితేంద్ర నుంచి స్పందన సరిగా లేకపోవడంతో గోరఖ్పూర్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేసినట్టు రవికిషన్ పీఆర్వో పవన్ ధూబే తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కంటోన్మెంట్ పీఎస్ ఇన్చార్జ్ శశి భూషణ్ రాయ్ తెలిపారు.
రవికిషన్ తెలుగులో సైరా నరసింహారెడ్డి, MLA, సాక్ష్యం, ఎన్టీఆర్ కథానాయకుడు, లై, రాధ, సుప్రీమ్, కిక్ 2, హీరో చిత్రాల్లో నటించారు. భోజ్పురి, హిందీ, కన్నడ, తెలుగు భాషల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు రవికిషన్. 2019 నుంచి యూపీలోని గోరఖ్పూర్ లోక్సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
Read Also : Brahmastra 2 | బ్రహ్మాస్త్ర 2లో మరో ఇద్దరు స్టార్ హీరోలు..కొత్తగా జాయిన్ అయ్యేది వీరే..!
Read Also : Trivikram | మహేశ్ కోసం తొలిసారి త్రివిక్రమ్ కొత్త ప్రయత్నం..వర్కవుట్ అయ్యేనా..?