గీత గోవిందం (Geetha Govindam) సినిమాతో మంచి క్రేజ్ సంపాదించి..హిట్ పెయిర్గా నిలిచారు విజయ్దేవరకొండ (Vijay Deverakonda)-రష్మిక మందన్నా (Rashmika Mandanna). ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన డియర్ కామ్రేడ్ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. విజయ్-రష్మిక కలిశారంటే చాలు కెమెరాల కళ్లన్నీ అటు వైపే ఉంటాయి. ఈ ఇద్దరు స్టార్ సెలబ్రిటీలు చాలా కాలం తర్వాత మళ్లీ ఒక్క చోట చేరిపోయారా..? అని ఇపుడు నెటిజన్లు తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న స్టిల్సే దీనిక్కారణం.
రష్మిక గోవా (Goa vacation) లోని అందమైన ప్రదేశాల్లో షికారు చేస్తూ టూర్ ఫొటోలను షేర్ చేసింది. అయితే తానెవరితో వెకేషన్లో ఉన్నానో మాత్రం సస్పెన్స్ లో పెట్టింది. స్విమ్మింగ్ పూల్, వుడ్స్ మధ్య దిగిన స్టిల్ను షేర్ చేస్తూ హ్యాపీ 2022 మై లవ్స్ అని క్యాప్షన్ ఇచ్చింది. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ కూడా ఇదే స్విమ్మింగ్ పూల్ దగ్గర చిల్ అవుట్ ఫొటోను ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. లైగర్ ఫస్ట్ గ్లింప్స్ కు వస్తున్న అద్బుతమైన స్పందనను వేడుకగా చేసుకుంటున్నాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
కూల్ అన్నా..ఈ ఫొటోలో నేను కుడి వైపున చూసిన ఆ చేతిని విజయ్ అన్న చేయి అని ఖచ్చితంగా అనుకుంటున్నానని మరో క్యాప్షన్ యాడ్ చేశాడు. దీంతో ఆనంద్ పక్కనుంది విజయ్ దేవరకొండనేని తెలిసిపోతుంది. ఓ వైపు రష్మిక, మరోవైపు దేవరకొండ బ్రదర్స్ ఒకే లొకేషన్ లో కనిపించేసరికి..రష్మిక, విజయ్ రహస్యంగా గోవా వెకేషన్ కు వెళ్లి ఉండొచ్చునని అంతా తెగ చెవులు కొరుక్కుంటున్నారు.