Rashmika Mandanna | ‘పుష్ప’ చిత్రంలో రష్మిక మందన్న పోషించిన శ్రీవల్లి పాత్ర తనకు బాగా సూటయ్యేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్యరాజేష్ చేసిన వ్యాఖ్యలు ఇద్దరు నాయికల అభిమానుల మధ్య తీవ్ర చర్చకు దారితీశాయి. సోషల్మీడియా వేదికగా ఫ్యాన్స్ తగువులాడుకుంటున్నారు. తాజాగా ఈ వివాదానికి ముగింపు పలుకుతూ కథానాయికలిద్దరూ సోషల్మీడియాలో పోస్ట్లు పెట్టారు. తన మాటల్ని కొందరు వక్రీకరించారని, రష్మిక మందన్నను కించపరిచేలా తాను ఎక్కడా మాట్లాడలేదని ఐశ్వర్య రాజేష్ పేర్కొంది.
‘పుష్ప’ చిత్రంలో రష్మిక మందన్న నటన తనను ఎంతగానో ఆకట్టుకుందని, అసత్య ప్రచారాలతో ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించొద్దని ఐశ్వర్య రాజేష్ తన అభిమానులకు విజ్ఞప్తి చేసింది. రష్మిక మందన్న స్పందిస్తూ ‘ఈ వివాదం కాస్త ఆలస్యంగా నా దృష్టికి వచ్చింది. ఐశ్వర్య..నువ్వేమిటో నాకు తెలుసు. నీ మాటల్ని నేను పూర్తిగా అర్థం చేసుకున్నా. నువ్వు ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ మీద నాకు గొప్ప గౌరవం ఉంది. ‘ఫర్హానా’ చిత్రంలో నీ నటన అద్భుతంగా ఉంది’ అంటూ ప్రశంసలతో ముంచెత్తింది. దీంతో ఈ వివాదానికి తెరపడినైట్లెంది.
“Rashmika mandanna | మీరు చెప్పాలనుకున్నది నాకు అర్థమైంది.. ఐశ్వర్య రాజేశ్ కామెంట్స్పై రష్మిక”