Bheeshma Parvam Movie | టాలీవుడ్లో ఈ మధ్య రీమేక్ల సందడి ఎక్కువైంది. ఇతర భాషల్లో హిట్టయిన సినిమాలకు ఇక్కడ మంచి గిరాకీ ఉంది. ముఖ్యంగా మలయాళ సినిమాలకు టాలీవుడ్లో భారీ డిమాండ్ ఉంది. రీసెంట్గా వచ్చిన ‘గాడ్ఫాదర్’ మూవీ కూడా మలయాళం సినిమాకు రీమేక్గా తెరకెక్కిన విషయం తెలిసిందే. కాగా తాజాగా మరో మలయాళ బ్లాక్బస్టర్ సినిమా రీమేక్కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన ‘భీష్మ పర్వం’ సినిమాను టాలీవుడ్లో రీమేక్ చేయనున్నట్లు టాక్. గ్యాంగ్స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చిలో విడుదలై ఘన విజయం సాధించింది.
టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా రీమేక్ హక్కులను రామ్చరణ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై రామ్చరణ్ నిర్మించనున్నాడట. కాగా ఈ రీమేక్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించనున్నట్లు తెలుస్తుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసి చిరుతో ఈ సినిమాను రూపొందించాలని చరణ్ ప్లాన్ చేస్తున్నాడట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ప్రస్తుతం చిరు ‘గాడ్ఫాదర్’ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు. రెండు రోజుల్లోనే ఈ చిత్రం సుమారు రూ.69 కోట్ల వరకు కలెక్షన్లు సాధించి బ్లాక్బస్టర్ దిశగా సాగుతుంది.
Read Also:
Waltair Veerayya | చిరు అభిమానులకు గుడ్న్యూస్.. ‘మెగా 154’ టీజర్ వచ్చేది అప్పుడేనట..!
Alluri Movie | అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘అల్లూరి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Ram Setu Movie | ‘రామ్సేతు’ ట్రయిలర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?