ఆర్ఆర్ఆర్ సక్సెస్ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు లీడ్ యాక్టర్లు రాంచరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). ఇటీవలే నైజాం ఏరియాలో మంచి కలెక్షన్లు వసూళ్లు చేసిన సందర్భంగా దిల్ రాజు హైదరాబాద్లో పార్టీ ఏర్పాటు చేయగా..ఆర్ఆర్ఆర్ టీంతోపాటు పలువురు సెలబ్రిటీలు హాజరై..సక్సెస్ పార్టీ (RRR Success party)ని ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇపుడు ముంబైలో ఆర్ఆర్ఆర్ సక్సెస్ ఈవెంట్ పెట్టగా..స్టార్ సెలబ్రిటీలు సందడి చేశారు.
జక్కన్న, తారక్, చరణ్ ఇతర యూనిట్ మెంబర్స్ తోపాటు బీటౌన్ స్టార్ సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే ఈ పార్టీలో బాలీవుడ్ నటి రాఖీసావంత్ (Rakhi Sawant) స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. బిజీబిజీగా కొనసాగుతున్న పార్టీలో ట్రిపుల్ ఆర్ హీరోలతో ఇంటరాక్ట్ అయ్యేందుకు ప్రయత్నించింది. రాంచరణ్ దగ్గరకెళ్లిన రాఖీసావంత్ ఆర్ఆర్ఆర్ భారీ సక్సెస్ అయినందుకు శుభాకాంక్షలు తెలియజేసింది.
‘మీరు నాతో నాటు నాటు స్టెప్పు (Naatu Naatu step) వేస్తారా..ప్లీజ్ ‘ అని రిక్వెస్ట్ చేసింది. అయితే రద్దీ ఎక్కువగా ఉండటంతో తాను డ్యాన్స్ చేయలేనని సున్నితంగా చెప్పాడట రాంచరణ్. ఇక వందల మందిలో ఉన్న ఎన్టీఆర్ దగ్గరకు రాఖీసావంత్ వెళ్లగా.. ఆమెతో సెల్పీ వీడియో తీసుకున్నాడు ఎన్టీఆర్. ఆ తర్వాత తారక్కు కూడా విషెస్ చెప్పింది రాఖీసావంత్. సక్సెస్ పార్టీలో తమ దగ్గరకు వచ్చిన రాఖీసావంత్తో గౌరవపూర్వకంగా వ్యవహరించిన ఈ ఇద్దరు దక్షిణాది హీరోలపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు, ఫ్యాన్స్.
అయితే దర్శకనిర్మాత కరణ్ జోహార్తో మాట్లాడేందుకు రాఖీ సావంత్ ప్రయత్నించగా..ఆమెను పట్టించుకోకపోవడంపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.