టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ ఎస్.రామారావు అలియాస్ రాకేష్ మాస్టర్(50) ఎక్కువగా వివాదాలతోనే వార్తలలో నిలుస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో అనేక సంచలన కామెంట్స్ చేస్తూ నిత్యం హెడ్ లైన్స్లో నిలుస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమంలోను పాల్గొంటున్నాడు. అయితే రాకేష్ మాస్టర్ శ్రీకృష్ణానగర్ ‘ఏ’ బ్లాక్లోని దేవేందర్ గౌడ్ అపార్ట్మెంట్స్లో నివసిస్తుండగా, సోమవారం సాయంత్రం తన ఇంట్లోకి సాయి యాదవ్, ఇమ్రాన్తో పాటు మరి కొందరు ప్రవేశించి దుర్బాషలాడుతూ కిటికిలు ధ్వంసం చేశారట.
తనపై దాడికి సంబంధించి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో రాకేష్ మాస్టర్ ఫిర్యాదు చేశారు. గతంలో ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ వల్లనే నాపై దాడి చేశారని పేర్కొన్నారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ రాకేష్ మాస్టర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు .