Sukumar | తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడు సుకుమార్ గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన చేసిన సినిమాలు.. అవి సాధించిన విజయాలు సుకుమార్ రేంజ్ ఏంటో తెలియజేస్తాయి. తాజాగా పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈయన. థియేటర్స్లో 300 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో స్ట్రీమింగ్ అవుతుంది. అక్కడ కూడా దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. దాంతో మరోసారి సుకుమార్ పేరు తెలుగు ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. ఇదిలా ఉంటే తాజాగా సుకుమార్ తన మనసులో మాట ఒకటి బయట పెట్టాడు. సాధారణంగా రీమేక్ సినిమాలకు దూరంగా ఉండే సుకుమార్.. రెండు తమిళ సినిమాలను మాత్రం తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాడు. ఆ సమయంలో తనను ఎవరూ వాటి గురించి అడగలేదని.. ఒకవేళ అడిగి ఉంటే కచ్చితంగా రీమేక్ చేసే వాడిని అంటూ చెప్పుకొచ్చాడు సుకుమార్.
సుకుమార్ మనసు అంతగా దోచేసిన రెండు సినిమాలు విక్రమ్ వేద, రాచ్చసన్. ఇప్పటికే రాచ్చసన్ సినిమాను తెలుగులో రాక్షసుడు పేరుతో రీమేక్ చేశాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. కానీ విక్రమ్ వేద మాత్రం ఇప్పటి వరకు ఇంకా ఎవరూ రీమేక్ చేయలేదు. తెలుగులో ఈ సినిమాలో రానా, వెంకటేష్ చేస్తే బాగుంటుందని చాలా రోజుల పాటు చర్చలు జరిగాయి. అయితే అది వర్కవుట్ కాలేదు. మరోవైపు రవితేజ పేరు కూడా ఈ రీమేక్లో వినిపించింది. ఇప్పటికీ అది అలాగే ఉండిపోయింది. తనకు రెండు సినిమాలు చూసినప్పుడు అద్భుతంగా అనిపించాయని.. వెంటనే ఎవరైనా అడిగితే తెలుగులో రీమేక్ చేయాలి అనిపించేంతగా వచ్చాయని చెప్పాడు సుకుమార్. కానీ ఎవరు అడగక పోవడంతో తాను కూడా సైలెంట్ అయిపోయానని అంటున్నాడు. మొత్తానికి క్రియేటివ్ డైరెక్టర్ మనసు దోచిన రెండు సినిమాలు తమిళ దర్శకులే తీశారు అన్నమాట.
ప్రస్తుతం పుష్ప ది రూల్ పనుల్లో బిజీ అయిపోయారు సుకుమార్. పుష్ప సినిమా షూటింగ్ ఫిబ్రవరి తర్వాత మొదలు పెట్టాలని చూస్తున్నారు. ఒకవేళ కరోనా వైరస్ కనికరిస్తే అనుకున్నట్టుగానే షూటింగ్ మొదలవుతుంది. ఇప్పటికే రెండో భాగానికి సంబంధించిన 50 శాతం షూటింగ్ కూడా పూర్తయింది. మిగిలిన భాగం త్వరగా పూర్తి చేసి డిసెంబర్ 2022లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Pushpa Deleted Scene | పుష్ప డిలీటెడ్ సీన్ చూశారా? ఈ సీన్ను ఎందుకు డిలీట్ చేశారో తెలుసా?
పుష్పలో ఐటెం సాంగ్కు సమంతను సుకుమార్ ఎలా ఒప్పించాడు?
పుష్ప రెండో భాగంలో అదే మేజర్ హైలైట్.. ఆమె పాత్ర చనిపోతుందట..
రాజమౌళి చదివింది ఇంటరే.. మరి త్రివిక్రమ్, క్రిష్, సుకుమార్ ఏం చదివారో తెలుసా?
పుష్ప సినిమా కోసం సుకుమార్ ముందు అనుకున్నది అల్లు అర్జున్ను కాదంట