83 సినిమాతో సూపర్ హిట్టు కొట్టాడు బాలీవుడ్ (Bollywood) యాక్టర్ రన్ వీర్ సింగ్ (Puri Jagannadh). ఈ క్రేజీ నటుడు ప్రస్తుతం తన అప్ కమింగ్ సినిమా రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ (Rocky Aur Rani Ki Prem Kahani) షూటింగ్తో బిజీగా ఉన్నాడు. కరణ్ జోహార్ (Karan Johar) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీ సెట్స్ లో సడెన్గా టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రత్యక్షమయ్యాడు. పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) తోపాటు నటి, నిర్మాత ఛార్మీ కూడా సెట్స్ కు వెళ్లింది.
రాకీ గెటప్లో ఉన్న రన్ వీర్ సింగ్ తో, డైరెక్టర్ కరణ్ జోహార్తో కలిసి కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చాడు. ‘గల్లీభాయ్’రన్ వీర్, కరణ్తో పూరీ, ఛార్మీ హమ్ చేస్తూ దిగిన స్టిల్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవర కొండతో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి కరణ్ జోహార్, ఛార్మీ, పూరీ జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరోవైపు ఇటీవలే విజయ్ దేవరకొండతో కలిసి రెండో సినిమా జనగణమనను ప్రకటించాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ పై త్వరలో వెల్లడి కానున్నాయి.
పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన టెంపర్ను రోహిత్ శెట్టి హిందీలో సింబా టైటిల్తో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. సింబాలో రన్ వీర్ సింగ్ టైటిల్ రోల్ పోషించాడు. అమితాబ్ బచ్చన్ నుంచి ఇప్పటి తరం హీరోల వరకు మంచి బాండింగ్ మెయింటైన్ చేస్తుంటాడు పూరీ.