ముంబై: బాలీవుడ్కు చెందిన అలనాటి సినీ నిర్మాత కుల్జీత్ పాల్ (90) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి గుండెపోటు రావడంతో ముంబైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. పాల్ మేనేజర్ సంజయ్ బాజ్పాయ్ ఇవాళ (ఆదివారం) ఉదయం మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇవాళ మధ్యాహ్నం నగరంలోని శాంటాక్రజ్ ఏరియాలోని శ్మశాన వాటికలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. కుల్జీత్ పాల్ అర్థ్, ఆజ్, పరమాత్మ, వాస్న, దో శికారీ, అషియానా లాంటి పలు చిత్రాలను నిర్మించారు. బాలీవుడ్లో ప్రముఖ నటిగా ఎదిగిన రేఖకు దో శికారీ సినిమా ద్వారా కుల్జీత్ పాల్ మంచి బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె ఇండస్ట్రీలో ఇక వెనుదిరిగి చూడలేదు.
Rekha celebrating her birthday on sets of Do Shikari (1979) with producer/director Kuljit Pal. pic.twitter.com/Q18VQk9QpG
— Subhash Shirdhonkar (@4331Subhash) May 17, 2021