‘గ్యాంగ్లీడర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ప్రియాంక అరుళ్ మోహన్. మొదటి సినిమాతోనే యూత్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత ‘డాక్టర్’, ‘డాన్’, ‘ఈటీ’ వంటి తమిళ డబ్బింగ్ సినిమాలతో మరింత చేరువైంది. ప్రస్తుతం ప్రియాంక స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా ఈమె మరో స్టార్ హీరోతో జతకట్టనుంది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు. తమిళ నటుడు ధనుష్.
కోలీవుడ్కు సమానంగా టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకుంటున్నాడు ధనుష్. ‘3’, ‘రఘువరన్ B-Tech’ వంటి సినిమాలో ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు. ఇటీవలే విడుదలైన ‘తిరు’తో వంద కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈయన నటించిన నానే వరువెన్ విడుదలకు సిద్ధంగా ఉంది. సెల్వా రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ అనే గ్యాంగ్ స్టర్ డ్రామా చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో హీరోయిన్గా ప్రియాంక మోహన్ ఎంపికైంది. ఈ చిత్రం ధనుష్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కనుందట. ఇక టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించనున్నాడు.
Read Also:
NBK107 | భారీ ధరకు బాలకృష్ణ ‘NBK107’ నాన్-థియేట్రికల్ హక్కులు.. వామ్మో అన్ని కోట్లా?
Thiru Movie | ఓటీటీలోకి ధనుష్ ‘తిరు’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Ye Maaya Chesave Movie | ‘ఏమాయ చేశావే’ మూవీని ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడా?