Ye Maaya Chesave Movie | ‘మణిరత్నం’ తర్వాత ఆ స్థాయిలో ప్రేమకథలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు గౌతమ్ వాసుదేవ మీనన్. ఈయన ఎన్ని యాక్షన్ సినిమాలు తీసినా, రోమ్-కమ్ సినిమాలకు వచ్చే అంత రెస్పాన్స్ రాకపోయేది. ఈయన ప్రేమకథల్లో ఉండే మేజిక్ వేరు. లవ్స్టోరీస్ను అందంగా, పోయేటిక్గా చెప్పడం ఈయన ప్రత్యేకత. ముఖ్యంగా ఈయన ప్రేమకథా చిత్రాల్లో ‘ఏమాయ చేశావే’ టాప్ ప్లేస్లో ఉంటుంది. టాలీవుడ్ క్లాసికల్ లవ్స్టోరీస్లో ఈ చిత్రం ఒకటి. అప్పట్లో ఈ చిత్రాన్ని నాగార్జునకు ‘గీతాంజలి’ ఎలాగో.. నాగచైతన్యకు ‘ఏమాయ చేశావో’ అలాగ అంటూ వర్ణించారు. నాగచైతన్య, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2010లో విడుదలై ఘన విజయం సాధించింది. సినిమా వచ్చి 12ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ కొత్త కొత్త సినిమా చూస్తున్న ఫీల్ ఏ వస్తుంది.
ఈ చిత్రంతో అటు నాగచైతన్యకు, ఇటు సమంతకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ముఖ్యంగా సమంతకు ఈ చిత్రంతో యూత్లో మంచి క్రేజ్ వచ్చింది. అయితే గౌతమ్ మీనన్ ముందుగా ఈ చిత్రాన్ని మహేష్తో తీయాలనుకునుకున్నాడట. అంతేకాకుండా మహేష్కు కథ కూడా నెరేట్ చేశాడట. కానీ ఆ టైమ్లో మహేష్ లవ్ స్టోరీలను చేయడానికి సిద్ధంగా లేడని, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కథను రెడీ చేయమని చెప్పాడట. దాంతో అలా ‘ఏమాయ చేశావే’ మూవీ నాగచైతన్య దగ్గరికి వెళ్లింది. అప్పటికి నాగచైతన్య ఒక్క సినిమా మాత్రమే చేశాడు. అది కూడా బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్గా మిగిలింది.ఈ క్రమంలో కెరీర్ ప్రారంభంలోనే నాగచైతన్యకు ఇంత మంచి కథ దొరకడం విశేషం అనే చెప్పాలి.
Read Also:
తగ్గేదేలే.. మరో పాన్ ఇండియా సినిమాతో రాబోతున్న ది లెజెండ్ శరవణన్ !!
Gharshana-2 | వెంకటేష్- గౌతమ్మీనన్ ‘ఘర్షణ’ మూవీ సీక్వెల్ తెరకెక్కనుందా?
SSMB29 | మహేష్-రాజమౌళి సినిమాలో హీరోయిన్లుగా ఆ ఇద్దరు బాలీవుడ్ భామలు?
Shankar | శంకర్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్?
Adipurush Movie | ‘ఆదిపురుష్’లో సోనాల్ చౌహన్ ఆయనకు భార్యగా నటించిందా?