SSMB29 Heroine | ఇండియాలోని గొప్ప దర్శకుల లిస్ట్ తీస్తే అందులో రాజమౌళి పేరు టాప్ ప్లేస్లో ఉంటుంది. ఉత్తరాధిన తెలుగు సినిమాలకు అంతగా గుర్తింపు లేని టైంలో ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో టాలీవుడ్ సినిమాకు గుర్తింపు తీసుకొచ్చాడు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ పేరును ప్రపంచానికి పరిచయం చేశాడు. ప్రస్తుతం ఈయన మహేష్తో సినిమా కోసం సిద్ధమౌవున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టేశాడు. ఈ చిత్రం గ్లోబ్ట్రోట్టింగ్ (ప్రపంచం మెత్తం ప్రయాణం చేయడం) అడ్వేంచర్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కతున్నట్లు ఇటీవలే ప్రకటించిన వియషం తెలిసిందే.
ఈ సినిమాపై మహేష్ అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. ఈ చిత్రంలో మహేష్బాబుకు జోడీగా ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. అలియాభట్, దీపికా పదుకొనే ఇద్దరి పేర్లను మేకర్స్ పరిశీలనలో ఉంచినట్లు టాక్. ఫైనల్గా ఈ ఇద్దరిలో ఒకరు కన్ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉందట. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఇక ఈ చిత్రం దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందనుందట. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు ఇంగ్లీష్లో ఏకకాలంలో తెరకెక్కిస్తారట. ఆ తర్వాత మిగితా భాషల్లో డబ్ చేస్తారట.