మంత్రి శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో తెలంగాణలో క్రీడల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. రాష్ట్ర నెట్బాల్ ఆసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని శనివారం ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. నెట్బాల్ క్రీడను ప్రోత్సహిస్తున్నామన్నారు. త్వరలోనే దేశంలోనే అత్యుత్తమ క్రీడాపాలసీని రాష్ట్రంలో ప్రవేశపెడతామన్నారు. నెట్బాట్ అసోసియేషన్ అధ్యక్షుడు విక్రమాదిత్యరెడ్డి, ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఖాజాఖాన్ తదితర కార్యవర్గ సభ్యులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.