ఈ ఏడాది ది ఘోస్ట్ సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు కింగ్ నాగార్జున (Nagarjuna). ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం మంచి బజ్ క్రియేట్ చేసినప్పటికి.. విడుదలయ్యాక మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే కంటెంట్ లోపించడంతో సినిమా అంతగా ఆడలేకపోయిందని ట్రేడ్ పండితుల అంచనా. కాగా ఇదిలా ఉంటే నాగార్జున నెక్ట్స్ ఎలాంటి చిత్రం చేయబోతున్నాడని అంతా చర్చించుకోవడం మొదలుపెట్టారు.
నాగార్జున చేయబోయే కొత్త సినిమా రీమేక్ అంటూ ఇండస్ట్రీ సర్కిల్ ఓ వార్త హల్ చల్ కూడా చేస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రీమేక్ చేయకపోవడమే మంచిదని నాగ్ అభిమానులు భావిస్తున్నట్టు మరోవైపు జోరుగా టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఈ పుకార్లపై రైటర్ ప్రసన్న కుమార్ (Writer Prasanna Kumar) క్లారిటీ ఇచ్చారు.
తాను ప్రస్తుతం ఓ ఫ్రెష్ కథాంశాన్ని సిద్దం చేసే పనిలో ఉన్నానని, నెక్ట్స్ నాగార్జున చేయబోయే ప్రాజెక్ట్ రీమేక్ కాదని అప్డేట్ ఇచ్చి పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ప్రసన్నకుమార్ నుంచి వచ్చిన అప్డేట్తో డైలామాలో ఉన్న అభిమానులు రిలాక్స్ అవుతున్నారు. ప్రస్తుతం రవితేజతో కలిసి ధమాకా చిత్రానికి పనిచేస్తున్నాడు ప్రసన్నకుమార్.
Read Also :Dhananjaya | కష్టపడకుంటే ఎవరూ సక్సెస్ కాలేరు.. రష్మికకు ధనంజయ మద్దతు
Read Also : Veerasimhareddy | వీరసింహారెడ్డి నుంచి సుగుణ సుందరి సాంగ్ టైం ఫిక్స్
Read Also :RRR | 24 ఏండ్ల తలైవా రికార్డును బ్రేక్ చేసిన ఆర్ఆర్ఆర్.. వివరాలివే..!