సినిమాల ద్వారా అందరికీ ఎప్పుడూ టచ్ లోనే ఉంటాడు ప్రకాశ్ రాజ్. అయితే ఈ విలక్షణ నటుడు మా ఎన్నికలు తెరపైకి రావడంతో ప్రతీ రోజూ వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ గా మారిపోయాడు. మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న మరో అభ్యర్థి మంచు విష్ణు లైమ్ లైట్ లోకి రావడంతో.. ప్రకాశ్ రాజ్ తన స్టేట్ మెంట్స్ తో అందరి అటెన్షన్ ను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారు. మరోవైపు తాను సొంత డబ్బులతో మా బిల్డింగ్ నిర్మిస్తానంటూ మంచు విష్ణు అందరి మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో మునిగిపోయాడు.
ఇదిలా ఉంటే ప్రకాశ్ రాజ్ మాత్రం కొన్ని రోజులుగా సైలెన్స్ ను మెయింటైన్ చేస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మంచు విష్ణు వ్యాఖ్యలపై రియాక్ట్ అవడం కానీ, ఇతర అంశాల గురించి కానీ ఎలాంటి కామెంట్స్ చేయకుండా సైలెంట్ గా ఉండాలని ప్రకాశ్ రాజ్ డిసైడ్ అయ్యాడట. ప్రకాశ్ రాజ్ క్యాంప్ నుంచి వచ్చిన టాక్ ప్రకారం..మా ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలోనే రంగంలోకి దిగాలని, అప్పటివరకు నిశ్శబద్దంగా ఉండాలని ప్రకాశ్ రాజ్ ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది. ఇతరులు చేసే కామెంట్లకు కౌంటర్ ఇవ్వొద్దని గట్టిగా ఫిక్సయినట్టు ఇన్ సైడ్ టాక్.
ఇవి కూడా చదవండి..
నాగశౌర్య మేనేజర్ గా వెంకట్..అతనెవరో తెలుసా..?
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
సినిమాలకు యువ హీరో గుడ్బై..?
ఇంటి పేరు తెచ్చిన తంటా..కరణ్ కుంద్రాకు చిక్కులు
బాలకృష్ణను భయపెట్టేది ఏంటో తెలుసా..?