Actor Prabhas | ప్రభాస్ ప్రస్తుతం ఓ భారీ హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ‘బాహుబలి’ వంటి ఇండస్ట్రీహిట్ తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో ప్రభాస్ తీవ్రంగా నిరాశపడ్డాడు. ప్రస్తుతం ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ఆదపురుష్ విడుదలకు సిద్ధంగా ఉండగా ‘సలార్’, ‘ప్రాజెక్ట్-K’ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది.
ప్రభాస్ మరో బాలీవుడ్ దర్శకుడిగా చాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ‘వార్’, ‘పఠాన్’ ఫేం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ సినిమా చేయనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రీ సంస్థతో కలిసి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మి్ంచనుందట. ఇక ఇప్పటికే మైత్రీ ప్రభాస్కు అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు టాక్. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుండి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ప్రస్తుతం ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ రిలీజ్కు సిద్ధంగా ఉంది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ చిత్రాన్ని ముందుగా సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే అదే రోజున మరో మూడు పెద్ద సినిమాలు రిలీజ్ కానున్నాయి. దాంతో ఆదిపురుష్కు థియేటర్ల సంఖ్య తగ్గుతుంది. ఈ క్రమంలో చిత్రబృందం సినిమాను సమ్మర్కు పోస్ట్ పోన్ చేయాలిన నిర్ణయించుకున్నట్ల సమాచారం. అంతేకాకుండా ఇటీవలే రిలీజైన టీజర్కు మిశ్రమ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. వీఎఫ్ఎక్స్ సరిగా లేదని డార్లింగ్ అభిమానులు మేకర్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వీఎఫ్ఎక్స్ పైన కూడా కొంచెం టైం కేటాయించాలని నిర్ణయించుకుందట.
Read Also:
PS-2 | ‘పొన్నియన్ సెల్వన్’ పార్ట్-2 రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?
Kantara Movie | ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కాంతార’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శిరీష్తో డేటింగ్ చేస్తున్నావా అని అల్లు అరవింద్ అడిగారు: అను ఇమ్మాన్యూయేల్
Vishwak sen | విశ్వక్సేన్పై అర్జున్ సీరియస్… ఫిల్మ్ చాంబర్లో కంప్లైంట్?