Anu Emmanuel | కెరీర్ బిగెనింగ్ నుండి నటన ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తున్న, కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోతుంది టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అను ఇమ్మాన్యూయేల్. ‘మజ్ను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ అనతికాలంలోనే స్టార్ హీరోలైన అల్లు అర్జున్తో ‘నా పేరు సూర్య’, పవన్ కళ్యాణ్తో ‘అజ్ఞాతవాసి’ సినిమాల్లో నటించే చాన్స్ కొట్టేసింది. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈమెకు అవకాశాలు తగ్గాయి. ఇక ఇటీవలే ఈమె అల్లు శిరీష్తో కలిసి నటించిన ‘ఊర్వసివో రాక్షసివో’ మూవీ రిలీజై పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది.
ఇదిలా ఉంటే గత కొంత కాలంగా అను ఇమ్మాన్యూయేల్, అల్లు శిరీష్లు డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో వాటిపై స్పందించింది. ఊర్వసివో రాక్షసివో సినిమాలో నటించడానికి ముందు అల్లు శిరీష్ను రెండు సార్లు మాత్రమే కలిసానని చెప్పింది. అంతేకాకుండా ఈ సినిమా గురించి మాట్లాడుకోవడానికి ఓ కాఫీ షాపులో శిరీష్ను కలిసినట్లు చెప్పింది. అయితే అలా కాఫీ షాపులో కలుసుకున్న ఫోటోలు బయటకు రావడంతో మేమిద్దరం డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ క్రియేట్ చేశారని వెల్లడించింది. అయితే ఇలాంటి రూమర్స్ను తను సీరియస్గా తీసుకోనని చెప్పింది. కానీ వాళ్ళ అమ్మ ఈ రూమర్స్పై చాలా అప్సెట్ అయిందట. అంతేకాకుండా అల్లు అరవింద్ ఒకరోజు తన ఇంటికి పిలిచి శిరీష్తో డటింగ్ రూమార్స్ గురించి అడిగారట. దానీపై ఇద్దరు కాసేపు నవ్వుకున్నట్లు చెప్పింది.
రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం రిలీజై పాజిటీవ్ టాక్తో దూసుకుపోతుంది. సునీల్, వెన్నెల కిషోర్ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ నిర్మించాయి.