Adipurush | ఒక్క టికెట్ బాసూ.. ఎవరైనా తెలిసిన వాళ్లున్నారా నాకు ఒక్క టికెట్ కావాలి.. ప్లీజ్ చూడు బాసూ డబ్బులు నేనిస్తాను కానీ టికెట్స్ ఇప్పించవా..! ఇదిగో ఇలాంటి మాటలు విని చాలా రోజులైపోయింది కదా..! ఇప్పుడున్న టెక్నికల్ యుగంలో ఇంట్లో కూర్చుని కావాల్సినన్ని టికెట్స్ బుక్ చేసుకునే సౌలభ్యం ఉంది. కానీ ఎన్ని ఉన్నా కొన్ని సినిమాలు వచ్చినపుడు మాత్రం ఆ టికెట్స్ కోసం యుద్ధాలు తప్పవు. తాజాగా ఆదిపురుష్ సినిమాకు ఇదే జరుగుతుంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాను ఓం రౌత్ తెరకెక్కించాడు. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది ఆదిపురుష్. అయితే ఈ సినిమా టికెట్స్ కోసం అభిమానులు యుద్ధాలు చేస్తున్నారు.
సోషల్ మీడియాతో పాటు అన్ని ఆన్లైన్ యాప్స్లోనూ టికెట్స్ కోసం తంటాలు పడుతున్నారు. తెలిసిన వాళ్లను కాకా పడుతున్నారు. ఏపీ, నైజాంలో టికెట్స్ ఓపెన్ చేసిన కొన్ని గంటలకే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. దాంతో సాధారణ ప్రేక్షకులకు చూద్దామంటే ఒక్క టికెట్ కూడా దర్శనమివ్వట్లేదు. దాంతో తెలిసిన వాళ్లను.. ఇన్ఫ్లూయెన్స్ ఉన్న వాళ్లను టికెట్స్ కోసం అడిగేస్తున్నారు. ప్లీజ్ బాసూ ఒక్క టికెట్ చూడు అంటూ రిక్వెస్టులు పెట్టేసుకుంటున్నారు. టికెట్లు ఇప్పించే సత్తా ఉన్న వాడే ఇప్పుడు బాహుబలి అన్నమాట. ఎన్ని వేల థియేటర్స్లో సినిమా విడుదలైనా కూడా అందుబాటులో మాత్రం టికెట్స్ కనిపించడం లేదు. రేట్ ఎంత ఎక్కువ పెట్టినా.. ఆదిపురుష్ క్రేజ్ ముందు అన్నీ అలా అయిపోయాయి.
తెలంగాణలో అయితే టికెట్స్ అమ్ముకోడానికి లేవు అంటూ ఏషియన్ సునీల్ లాంటి వ్యక్తే చెప్పాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గంపగుత్తగా కొన్ని నిర్మాణ సంస్థలు కూడా ఆదిపురుష్ టికెట్స్ బ్లాక్ చేశాయి. దాంతో కామన్ పీపుల్కు టికెట్స్ అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. ఒక్కొక్కరు 10 వేల టికెట్స్ కూడా కొన్నారు.. దానికితోడు మరికొందరు కూడా వేలకు వేల టికెట్లు తీసుకున్నారు. దాంతో మొదటిరోజు సినిమా చూడాలనుకుంటున్న సినిమా లవర్స్కు ఆదిపురుష్ థియేటర్స్లో షాక్ తప్పట్లేదు. అందుకే తెలిసిన వాళ్లనే కాకా పడుతూ టికెట్స్ తెప్పించుకుంటున్నారు. అజ్ఞాతవాసి, బాహుబలి, ట్రిపుల్ ఆర్ తర్వాత మళ్లీ ఇప్పుడే ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు.
Shilpa Shetty | శిల్పా శెట్టి నివాసంలో చోరీ : ఇద్దరిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు