Adipurush | ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్ పోషిస్తున్న మైథలాజికల్ డ్రామా ఆదిపురుష్ (Adipurush). ఓం రౌత్ (Om Raut) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆదిపురుష్ విడుదల రోజు ఆరు షోలకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఉదయం 4 గంటల నుంచి షోలు ప్రారంభం కానున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50 పెంచుకునే అవకాశం ఇచ్చింది. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆదిపురుష్ టికెట్ల ధరలను పెంచుకునే అవకాశమిచ్చింది.
టికెట్స్ ధరలను రూ.50 పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ.. జీవో జారీచేసింది. ఈ పెంపు ఏపీలోని మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్ థియేటర్లకు వర్తించనుంది. విడుదల రోజు (జూన్ 16) నుంచి 10 రోజులపాటు పెంచిన టికెట్ల ధరలు అమలులో ఉండనున్నాయి. తాజా జీవో ప్రకారం ఏపీలో మల్టీప్లెక్స్లలో రూ.236, సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో రూ.210గా టికెట్ల ధరలుండబోతున్నాయి. హైదరాబాద్లో ఇప్పటికే టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడవుతున్నాయి.
తెలంగాణలో మొదటి 3 రోజులు టికెట్ ధర పెంచుకునేందుకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రస్తుతం టికెట్ ధర రూ.175 ఉండగా.. దీనికి అదనంగా రూ.50 చెల్లించాలి. ప్రభాస్ ఆదిపురుష్లో రాముడిగా నటిస్తుండగా.. బాలీవుడ్ భామ కృతిసనన్ సీతగా నటిస్తోంది. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, రావణాసురుడి (లంకేశ్)గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో దేవ్దత్తా నగే హనుమంతుడి పాత్ర పోషిస్తున్నారు. టీ సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. సాచెట్-పరంపర ఆదిపురుష్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.