ముంబై : బాలీవుడ్ నటి శిల్పా శెట్టి (Shilpa Shetty) నివాసంలో చోరీ ఘటన కలకలం రేపింది. ముంబైలోని జుహు ప్రాంతంలో శిల్పా శెట్టి నివాసంలో జరిగిన చోరీ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నటి నివాసంలో గత వారం జరిగిన చోరీలో కొన్ని విలువైన వస్తువులు పోయాయని పోలీసులు తెలిపారు. నటి ఫిర్యాదు మేరకు జుహు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చెప్పారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
జూన్ 8న తన బర్త్డేను జరుపుకున్న శిల్పా శెట్టి ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి ఇటలీ విహార యాత్రకు వెళ్లారు. ఇక 14 ఏండ్ల అనంతరం 2021లో హంగామా 2తో ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు.ఆపై ఆమె నికమ్మలో కనిపించగా త్వరలో రోహిత్ శెట్టి ఇండియన్ పోలీస్ ఫోర్స్లో ఓటీటీపై సందడి చేయనున్నారు.
Read More :
Sreeleela | కొంగొత్త అందాల సుమబాల.. లంగావోణిలో మెరిసిపోతున్న శ్రీలీల