వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుక | పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆ మాత్రం హడావిడి ఉంటుంది. ఈయన్ని చూడ్డానికి.. ఆయనతో కలిసి ఫోటోలు దిగడానికి సెలబ్రిటీలు సైతం పోటీ పడుతుంటారు. ఇక కామన్ ఆడియన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. శిల్ప కళా వేదికలో వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారు.. ఈ వేడుక కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే కరోనా కూడా భారీగానే ఉండటంతో దర్శక నిర్మాతలకు ఈ ఫంక్షన్ జరపడమే ఇప్పుడు సవాల్లా మారిపోయింది. ఎన్నో తంటాలు పడి ఈ వేడుకకు అనుమతి తెచ్చుకున్నాడు నిర్మాత దిల్ రాజు. ఇప్పుడు ఈ వేడుకను చూసేందుకు ఉదయం నుంచే అభిమానులు తరలివచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూడ్డానికి వస్తున్న ఫ్యాన్స్తో శిల్పకళా వేదిక ఇప్పుడు జనసందోహంగా మారిపోయింది.
సాయంత్రం వేడుక ఉంటే మధ్యాహ్నం 2 గంటల నుంచే అభిమానులు శిల్ప కళా వేదిక వైపు రావడం ఆందోళన రేకెత్తిస్తుంది. అసలు కరోనా కేసులు దారుణంగా పెరిగిపోతున్న తరుణంలో పవన్ ఫంక్షన్ జరపడమే చాలా మందికి నచ్చట్లేదు. పవర్ స్టార్ కోసం రూల్స్ మార్చేస్తున్నారా అంటూ కొందరు విమర్శిస్తున్నారు కూడా. అయితే పాసులు లేకపోతే మాత్రం దయచేసి అక్కడికి రావద్దు అంటూ దిల్ రాజు నేరుగా పాసుల్లోనే ప్రింట్ చేయించాడు. స్పెషల్ నోట్ కూడా అందులో పెట్టించాడు ఈయన.
అక్కడికి వచ్చి నిరాశ పడేకంటే కూడా ఇంటి దగ్గరే కూర్చుని హాయిగా వేడుక ఎంజాయ్ చేయండని చెప్పుకొచ్చాడు. అయినా కూడా పవన్ అభిమానులు వినేలా కనిపించడం లేదు. పాసులు లేకపోయినా కూడా అక్కడే కనిపిస్తున్నారు. భారీ సంఖ్యలోనే పవన్ ఫ్యాన్స్ శిల్ప కళా వేదిక దగ్గర గుమిగూడటం సంచలనంగా మారుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పవన్-హరీష్ శంకర్ మూవీ క్రేజీ అప్డేట్
చిరంజీవి చెల్లెలుగా జయమ్మ ఒప్పుకుంటుందా..?
రకుల్ప్రీత్సింగ్ లాఫింగ్ నినాదం
రాజ్పుత్ బ్యూటీ అందానికి స్టన్ అవ్వాల్సిందే..!
బాలీవుడ్ ఎంట్రీకి నాగబాబు రెడీ..!
హిందీలో రష్మిక మందన్న, హన్సికను ఓడించిన అల్లు శిరీష్
మెగాస్టార్ ఆచార్య ‘లాహే లాహే’ సాంగ్కు భారీ రెస్పాన్స్
వకీల్ సాబ్ సినిమాలో మెగా హీరో గెస్ట్ రోల్
రికార్డు స్థాయి థియేటర్లలో వకీల్ సాబ్ రిలీజ్