Cool jayanth | సినీ పరిశ్రమలో మరణ మృదంగం ఆగడం లేదు. వరుసగా ప్రముఖులు కన్ను మూస్తూనే ఉన్నారు. ఆ మధ్య తెలుగు ఇండస్ట్రీలో యువ నిర్మాత మహేశ్ కోనేరు కేవలం 40 సంవత్సరాల వయసులో గుండెపోటుతో కన్నుమూశారు. ఆ తర్వాత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ హఠాన్మరణం దేశవ్యాప్తంగా ఒక సంచలనం. ఈయన చనిపోయిన విషయం జీర్ణించుకోలేక దాదాపు 16 మంది అభిమానులు కర్ణాటకలో కన్నుమూశారు. వీళ్ల మరణాలు ఇంకా మర్చిపోకముందే తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది.
కేవలం 44 ఏళ్ల వయసులో ఒక కొరియోగ్రాఫర్ కన్నుమూశాడు. ఎన్నో తమిళ, మలయాళ సినిమాలకు పని చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ కూల్ జయంత్ నవంబర్ 10న ఉదయం చెన్నైలో మృతి చెందారు. కెరీర్ మొదట్లో డాన్సర్గా పలు వేడుకల్లో షో లు చేసిన ఈయన.. అటు తర్వాత ఎంతో కష్టపడి డ్యాన్స్ మాస్టర్గా ఎదిగాడు. ప్రభుదేవా, రాజు సుందరం లాంటి స్టార్ కొరియోగ్రాఫర్ల దగ్గర డాన్సర్గా పని చేసిన కూల్ జయంత్.. దాదాపు 800 చిత్రాలకు పైగానే డ్యాన్సర్గా పనిచేశారు. ఆ తర్వాత ‘కాదల్ దేశం’ చిత్రంతో కొరియోగ్రాఫర్గా మారారు.
తమిళంతో పాటు మలయాళ భాషల్లో 100కు పైగా చిత్రాలకు కొరియోగ్రఫీ అందించాడు జయంత్. ముఖ్యంగా మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు కూడా ఆయన కొరియోగ్రఫీ అందించారు. కొన్ని రోజులుగా క్యాన్సర్ మహమ్మారితో బాధ పడుతున్న ఈయన.. పరిస్థితి విషమించడంతో నవంబర్ 10న కన్ను మూశారు. ఎంతో భవిష్యత్తు కళ్లముందు ఉండగా కేవలం 44 సంవత్సరాల వయసులో ఈయన మరణించడం అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమను కూడా విషాదంలో ముంచేసింది. తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కంటతడి పెట్టిస్తున్న పునీత్ రాజ్కుమార్ పెంపుడు కుక్కలు..
పునీత్ మరణ వార్త చదువుతూ.. లైవ్లోనే ఏడ్చేసిన న్యూస్ రీడర్
పక్కా కమర్షియల్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్.. గోపీచంద్ వచ్చేది అప్పుడే..!
ఒక ప్రొడ్యూసర్ నా నడుం మీద చపాతీ కాలుస్తానన్నాడు.. గుర్తుచేసుకున్న బోల్డ్ బ్యూటీ
Nayantara or Samantha | సమంత, నయనతారలో ఇంతకీ ఎవరు ఆ ఛాన్స్ కొట్టేసేది..?