పాన్ ఇండియా సినిమా ప్రేమికులు ఎక్జయిటింగ్గా ఎదురుచూస్తున్న సినిమా పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan). మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వం రెండు పార్టులుగా వస్తుండగా..పొన్నియన్ సెల్వన్-1 (Ponniyin Selvan-1) సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలవుతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రచార కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది.
ఇప్పటికే చెన్నై, హైదరాబాద్లో ఆడియో, ట్రైలర్ లాంఛ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగాయి. కాగా చిత్ర బృందం ప్రమోషన్స్ కోసం ఇపుడు దేశ రాజధాని నగరం ఢిల్లీలో ల్యాండైంది. ఢిల్లీలో జరుగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరయ్యేందుకు లీడ్ యాక్టర్లు కార్తీ, జయం రవి, ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai), త్రిష (Trisha) అక్కడికెళ్లారు. వీరంతా కలిసి దిగిన ఫొటో ఒకటి ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
భారీ మల్టీస్టారర్గా పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో విక్రమ్, కార్తీ, జయం రవి, శరత్కుమార్, జయరామ్, విక్రమ్ ప్రభు, పార్థీబన్, ప్రకాశ్ రాజ్, అరవింద్ స్వామి, శోభితా ధూళిపాళ, ఐశ్వర్యా రాయ్, త్రిష, కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది.
Hello DELHI ✨ Team #PS1 is Here! 🤩 #PS1 🗡️ #PonniyinSelvan1 🗡️ #ManiRatnam @arrahman @MadrasTalkies_ @LycaProductions @tipsofficial @Karthi_Offl #AishwaryaRaiBachchan @trishtrashers @actor_jayamravi @PenMovies pic.twitter.com/5BUzkbqkOk
— Ramesh Bala (@rameshlaus) September 26, 2022