సిల్వర్ స్క్రీన్పై కొన్ని కాంబినేషన్లు వచ్చాయంటే బాక్సాపీస్ షేక్ అవ్వాల్సిందే. హిట్ కాంబినేషన్ తెరపైకి వస్తుందంటే మూవీ లవర్స్ కు పూనకాలు వచ్చేస్తుంటాయి. అలాంటి క్రేజీ కాంబోల్లో టాప్లో ఉంటారు బాలకృష్ణ -బోయపాటి శ్రీను (Boyapati-Balakrishna). ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే చాలు..నందమూరి అభిమానులు సంబురాల్లో మునిగితేలిపోతుంటారు. సినిమా షురూ అయినప్పటి నుంచి విడుదలై..రికార్డుల మోత మోగించే ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తుంటారు.
ఈ ఆల్ టైమ్ ఫేవరేట్ బ్లాక్ బాస్టర్ కలయికలో మరో సినిమా వస్తుందంటే ఎలా ఉంటుంది. దీనికి సంబంధించిన అప్డేట్ క్రేజీ న్యూస్ ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. గతేడాది అఖండతో అదిరిపోయే హిట్టు కొట్టారు బాలయ్య-బోయపాటి. ఈ ఇద్దరు మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారన్న వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
ఈ సారి మాత్రం పక్కా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ (Political Film)లో ఉండబోతుందట. 2024 ఎన్నికల్లో (2024 elections. ) టీడీపీకి కలిసొచ్చే విధంగా ఈ స్టోరీ ఉండబోతుందని జోరుగా టాక్ నడుస్తోంది. ఇంతకీ ఏ బ్యానర్ అనేదానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేకున్నా..స్క్రిప్ట్ వర్క్ పనులు మాత్రం కొనసాగుతున్నాయట. బాలయ్యతో సీక్వెల్గా ఈ పొలిటికల్ ప్రాజెక్టు ఉండబోతుందని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
ఇదిలా ఉంటే అఖండ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందన్న టాక్ కూడా ఇప్పటికే ఉంది. మరి బోయపాటి-బాలయ్య సినిమా అఖండ సీక్వెల్ ప్రాజెక్టేనా..? లేదంటే కంప్లీట్గా కొత్త ప్రాజెక్టా…అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ఎన్బీకే 107, అనిల్ రావిపూడితో జై బాలయ్య చిత్రాలు చేస్తున్నాడు బాలకృష్ణ. వీటి తర్వాత బోయపాటి సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని క్రేజీగాసిప్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
Read Also : Remunerations | Mega 154 క్రేజీ టాక్..బడ్జెట్లో అగ్రభాగం రెమ్యునరేషన్లకే..?
Read Also : Kesariya Song | బ్యూటిఫుల్ ‘కేసరియా’ మెలోడీ లవ్ ట్రాక్ వచ్చేసింది..