Penny Song | దాదాపు రెండేళ్ళ తర్వాత మహేష్బాబు నుంచి వస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ‘గీతాగోవిందం’ ఫేం పరుశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. గతేడాది మహేష్ బర్త్డే సందర్భంగా విడుదలైన ‘సర్కారువారి పాట బ్లాస్ట్’ నుంచి లేటెస్ట్గా విడుదలైన ‘పెన్నీ’ ప్రోమో వరకు సినిమాపై ప్రేక్షకులలో రెట్టింపు అంచనాలను పెంచుతున్నాయి. ఇప్పటికే థమన్ స్వర పరిచిన ‘కళావతి’ పాట యూట్యూబ్లో రికార్డు వ్యూస్ను సాధిస్తుంది. ఇప్పటికే ఈ లిరికల్ వీడియోను తొమ్మిదిన్నర కోట్ల మంది వీక్షించారు. ఇదిలా ఉండగానే ఈ చిత్ర సెకండ్ సింగిల్ ‘పెన్నీ’ సాంగ్ లిరికల్ వీడియో తాజాగా విడుదలైంది.
‘ఇందుమూలంగా.. యావత్ ప్రజానికానికి తెలియజేయునది ఏమనగా’ అంటూ మొదలైన ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. మహేష్బాబు తనయిక సితార డ్యాన్స్ ఆకట్టుకుంటుంది. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించిగా నకాష్ అజీజ్ ఆలపించాడు. బ్యాంక్ మోసాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్లతో కలిసి మహేష్బాబు స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వేసవిలో మే12న ప్రేక్షకుల మందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.
ఇవి కూడా చదవండి:
Vijay Devarakonda | ఆర్మీ ఆఫీసర్గా విజయ్ దేవరకొండ?