టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) దర్శకత్వంలో తెరకెక్కాల్సిన చిత్రం సత్యాగ్రాహి (Satyagrahi). 2003లో ఘనంగా లాంఛ్ అయిన ఈ ప్రాజెక్టు అనూహ్యంగా అటకెక్కింది. 18 ఏండ్ల తర్వాత పవన్ కల్యాణ్ ఈ సినిమా గురించి ట్వీట్ చేస్తూ అందరికి సర్ప్రైజ్ ఇచ్చాడు. మొదట లోకనాయక్ జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు పవన్. జనసేన పార్టీపై జయప్రకాశ్ నారాయణ్ సిద్దాంతాల ప్రభావం ఉంటుందని ఈ సందర్భంగా పవన్ చెప్పారు.
అంతేకాదు జయప్రకాశ్ నారాయణ్ (Lokanayak Jayaprakash Narayan) ఎమెర్జెన్సీ ఉద్యమం సమకాలీన పరిస్థితుల స్ఫూర్తిగా పొలిటికల్ ఫిల్మ్గా సత్యాగ్రాహిని తీయాలని సంకల్పించినట్టు ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటించడం కంటే దాని గురించి మాట్లాడుతూ, ఆ అడుగుజాడల్లో నడవడం చాలా సంతృప్తినిస్తుందని తెలిపారు. సుదీర్ఘ విరామం తర్వాత సత్యాగ్రాహి సినిమాను గుర్తు చేస్తూ పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు చిత్రంలో నటిస్తున్నాడు.
పాన్ ఇండియా కథాంశం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నిధి అగర్వాల్ ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Chiranjeevi | మా ఎన్నికల ఫలితాలపై చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్
Divorce: విడాకులకి సిద్ధమవుతున్న మరో తెలుగు హీరో..నిజమెంత?
Tollywood | ‘మా’ ఎన్నికల పోలింగ్ లో కనిపించని తారలు వీళ్లే
Pragya Jaiswal: ప్రగ్యాకి కరోనా.. టెన్షన్లో బాలయ్య అభిమానులు