వనిత విజయ్ కుమార్ ఈ పేరు కొన్నాళ్ల క్రితం వార్తలలో తెగ నానుతూ వచ్చింది. సీనియర్ నటుడు వినిత విజయ్ కుమార్ తనయ వనిత ఇటీవల మూడో వివాహం చేసుకుంది. ఈ వ్యవహారం రచ్చరచ్చగా మారింది. అతనితో అయిన వైవాహిక జీవితం కొనసాగిస్తుందా అంటే అతనికి మధ్యలోనే బ్రేకప్ చెప్పేసింది. దీంతో వనిత అంటే ఆమె అభిమానులకు కూడా విసుగు వచ్చింది.అయితే ప్రస్తుతం కరోనా తాండవం సృష్టిస్తున్న సమయంలో కోవైలో కొందరు కరోనా దేవి పేరుతో ఒక విగ్రహాన్ని ప్రతిష్టించారు
విగ్రహానికి తెగ పూజలు చేస్తూ కరోనా నుండి త్వరగా కోలుకోవాలని మొక్కుతున్నారు. అయితే వనితను కొందరు ఈ వ్యవహారంలోకి లాగారు. కరోనా దేవి ప్రతిమ అచ్చం వనితా దేవి మాదిరిగానే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె మీద మీమ్స్ కూడా క్రియేట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీనిపై వనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.