కరోనా విజృంభిస్తున్న వేళ రోగులకు ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఏర్పడింది. ఆక్సిజన్ దొరక్క చాలా మంది కన్నుమూసిన సందర్బాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఆక్సిజన్ కొరతను తగ్గించేందుకు చిత్ర పరిశ్రమ నుంచి ఎందరో ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే సోనూసూద్, సమంత, చిరంజీవి వంటి ప్రముఖులు ఆక్సిజన్ సాయం చేస్తుండగా, తాజాగా దర్శకుడు సుకుమార్ కూడా ఇందులో భాగం అయ్యారు. తన మిత్రుడు రాంబాబుతో కలిసి తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు సుకుమార్.
ప్రభుత్వ అనుమతి లభిస్తే త్వరగా ప్లాంట్ నిర్మించేందుకు సిద్థంగా ఉన్నామని, రూ.25లక్షలు ఇచ్చేందుకు కూడా సిద్థంగా ఉన్నట్లు సుకుమార్ అధికారులతో అన్నారు. ప్రస్తుతం ఆక్సిజన్ లేక ఇబ్బంది పడుతున్న వారికి సిలిండర్స్ అందించేందుకు ఆజాద్ ఫౌండేషన్కు రూ.7 లక్షల విలువైన ఆక్సిజన్ సిలిండర్లు అందించారు. సీనియర్ బాలీవుడ్ నటి, లోక్సభ ఎంపీ హేమమాలిని ఏడు ఆక్సిజన్ ఎన్హాన్సర్స్ ఏర్పాటు చేశారు. ఆమె ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న మథుర నియోజకవర్గంలోని బ్రజ్ ప్రాంతంలో వీటిని ఏర్పాటు చేశారు.
.